కబురు న్యూస్,హైదరాబాద్,మే 13 : మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అజ్ఞాతం వీడారు.భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు.డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన నక్సల్స్ విధానాలకు ఆకర్షితులయ్యారు.రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య,క్రాంతిరణదేవ్ కారణంగా ఉద్యమం వైపు వచ్చారు.తర్వాతి కాలంలో అడవి బాట పట్టారు.మావోయిస్టు అగ్రనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఝార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక
కబురు న్యూస్,హైదరాబాద్,మే 13 :
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి అజ్ఞాతం వీడారు.భార్యతో కలిసి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం.హనుమకొండ జిల్లా కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన నరహరి 45 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నారు.డిగ్రీ చదువుతున్న సమయంలో ఆయన నక్సల్స్ విధానాలకు ఆకర్షితులయ్యారు.రాష్ట్ర కార్యదర్శి పులి అంజయ్య,క్రాంతిరణదేవ్ కారణంగా ఉద్యమం వైపు వచ్చారు.తర్వాతి కాలంలో అడవి బాట పట్టారు.మావోయిస్టు అగ్రనేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.ఝార్ఖండ్ ఈస్ట్ రీజినల్ బ్యూరో టెక్నికల్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించారు.పలు కీలక ఆపరేషన్స్లో ఆయన పాల్గొన్నారు.ఝార్ఖండ్లోని సరండా ఫారెస్ట్లో పొలిట్ బ్యూరో సభ్యుడు మిసిర్ బెస్ర కోసం భద్రతా బలగాలు కూంబింగ్ తీవ్రతరం చేయడంతో నరహరి తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తుంది..










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *