కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు... కబురు న్యూస్,నిజామాబాద్ క్రైమ్,మే 09 : నిజామాబాద్ జిల్లాలో దొంగలు వరుస చోరీలకు పాల్పడుతూ,ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ,పోలీసులకు సవాలుగా మారుతున్నారు.ఇటీవల డిచ్పల్లిలో మూడు ఇండ్లలో చోరికి పాల్పడ్డ దుండగులు తాజాగా సోమవారం అర్ధరాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో తాళం వేసిన ఓ ఇంట్లో భారీ చోరికి పాల్పడ్డారు.ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది.స్థానికంగా ఉండే రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ రవికుమార్ ఇంటికి తాళం వేసి హైదరాబాదుకుREAD MORE
సంగారెడ్డిలో డ్రగ్స్ కలకలం... అంతర్జాతీయ మార్కెట్లో రూ.6.5 కోట్ల వరకు అంచనా... పచ్చని చేల చాటున..తండా నీడన..గుట్టుగా సాగుతున్న గరళాల వ్యాపారం... యువత ప్రాణాలను పీల్చేసే మహమ్మారి... సంగారెడ్డిలోని మారుమూల ప్రాంత తాండాలో డ్రగ్స్ తయారీ... మహారాష్ట్ర ఖాకీలు ఉగ్రులై ఉరికారు,మెరుపు దాడితో ఆ గుట్టును రట్టు చేశారు... కోట్ల విలువైన డ్రగ్స్ రక్కసి కోరలు విరిచారు... చీకటి సామ్రాజ్యపు మూలాలను కదిలించారు... సరిహద్దులు దాటి వచ్చి రక్షించిన రక్షకులు... కబురు న్యూస్,సంగారెడ్డి, జూన్ 03 :READ MORE
18 జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసిన ఐఎండీ... కబురు న్యూస్,హైదరాబాద్, జూన్ 03 : నైరుతి రుతుపవనాలు గురువారం నాటికి కేరళ,తమిళనాడు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్న నేపథ్యంలో,తెలంగాణలో వాతావరణం వేగంగా మారుతోంది.బుధ,గురువారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది. *రాష్ట్రంలోని పలు జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేసింది* ఆదిలాబాద్,కొమరం భీమ్ ఆసిఫాబాద్,మంచిర్యాల,నిర్మల్,నిజామాబాద్,జగిత్యాల,రాజన్న సిరిసిల్ల,కరీంనగర్,పెద్దపల్లి,జయశంకర్ భూపాలపల్లి,ములుగు,భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం,నల్గొండ,సూర్యాపేట,మహబూబ్నగర్,వరంగల్,హన్మకొండ జిల్లాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన భారీREAD MORE
కబురు న్యూస్,నిర్మల్,మే 29 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు (ట్రిప్లెట్స్) జన్మించ్చింది.దాదాపు 8000 మంది గర్భిణీలలో ఒకరికి మాత్రమే ఇలా ముగ్గురు పిల్లలు ఒకేసారి జన్మించే అవకాశం ఉంటుందని డా.శశికాంత్ తెలిపారు.తీవ్రమైన ప్రాణాపాయ స్థితిలో ఉన్న తల్లిని,ముగ్గురు నవజాత శిశువులను వైద్యులు అత్యంత ప్రతిభతో కాపాడినట్లు వారు పేర్కొన్నారు.READ MORE
చేవెళ్ల గడ్డపై కన్నీటి గాయం... గొంతు కోసి కాళ్లు నరికి మహిళ హత్య... కబురు న్యూస్,రంగారెడ్డి,మే 28 : ఆభరణాలపై అత్యాశతో మానవత్వాన్ని మింగేసిన దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో కలకలం రేపింది.కడియాలు,చెవి కమ్మల కోసం ఓ మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసి,ఆమె కాళ్లను నరికేసిన అమానుష ఘటన సమాజాన్ని కలచివేసింది.పసిడి కోసం ప్రాణాలనే బలి తీసుకున్న ఈ మృగత్వం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.పోలీసుల వివరాల ప్రకారంగా..చేవెళ్ల మండలంలోని గొల్లపల్లి అనుబంధREAD MORE
వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలో ఘటన... కబురు న్యూస్,సంగారెడ్డి,మే 27 : సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శానిటేషన్ వర్కర్గా పనిచేస్తున్న అనిత ఆత్మహత్య యత్నానికి పాల్పడింది.మూడు నెలలుగా జీతాలు లేక కుటుంబ పోషణ భారం కావడంతో అనిత ఆలౌట్(దోమల మందు)తాగిందని సమాచారం.ఆమెను స్థానికులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.జీతాలు రాకపోవడంతో మెడికల్ కాలేజీలో 400 మంది కార్మికులు ఆందోళనలో ఉన్నట్లు తెలిసింది.వైద్యారోగ్య శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ఈ దారుణ పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులుREAD MORE