టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్.. 4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్లు రద్దు..కారణమిదే..! కబురు న్యూస్,న్యూ ఢిల్లీ,మార్చ్ 07 : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను,ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.ఇరాన్,ఇజ్రాయెల్,అమెరికా యుద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయాన్ని ప్రజల్లో సృష్టించి టీఆర్పీ పెంచుకుంటున్న టీవీ ఛానళ్లకు షాకిచ్చిన కేంద్రం నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇండియాలో BARC రేటింగ్స్ను
టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
4 వారాల పాటు టీఆర్పీ రేటింగ్లు రద్దు..కారణమిదే..!
కబురు న్యూస్,న్యూ ఢిల్లీ,మార్చ్ 07 :
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను,ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.ఇరాన్,ఇజ్రాయెల్,అమెరికా యుద్ధ వార్తల ద్వారా అనవసరమైన భయాన్ని ప్రజల్లో సృష్టించి టీఆర్పీ పెంచుకుంటున్న టీవీ ఛానళ్లకు షాకిచ్చిన కేంద్రం నాలుగు వారాలు లేక తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇండియాలో BARC రేటింగ్స్ను సస్పెండ్ చేసిన కేంద్రం.ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో వార్తా ఛానళ్లు అనవసర ఉద్వేగాలను,ఊహాజనిత వార్తలను ప్రసారం చేయడంపై కేంద్ర సమాచార,ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది.ఇలాంటి సంచలన వార్తలు యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ నేపథ్యంలో,ప్రజా ప్రయోజనాల దృష్ట్యా న్యూస్ ఛానళ్ల టీఆర్పీ (TRP) రేటింగ్లను తక్షణమే నిలిపివేయాలని బార్క్ (BARC) సంస్థను ఆదేశించింది.ఈ నిషేధం నాలుగు వారాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుందని స్పష్టం చేసింది.























Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *