12 ఏళ్లు ప్రధాని పదవిలో ఉన్న మొదటి వ్యక్తి నరేంద్ర మోదీ యే సంక్షేమ పథకాల్లో రేవంత్ సర్కార్ విఫలం కమిషన్లు వచ్చే పనులే చేస్తుండ్రు.. పనికిమాలిన యూరియా యాప్ ను రద్దు చేయాలి పాత పద్ధతిలోనే యూరి యా పంపిణీ చేయాలి ఎంపీ ధర్మపురి అరవింద్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15: దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం సర్వ తోముఖాభివృద్ధి చెందు తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
12 ఏళ్లు ప్రధాని పదవిలో ఉన్న మొదటి వ్యక్తి నరేంద్ర మోదీ యే
సంక్షేమ పథకాల్లో రేవంత్ సర్కార్ విఫలం
కమిషన్లు వచ్చే పనులే చేస్తుండ్రు..
పనికిమాలిన యూరియా యాప్ ను రద్దు చేయాలి
పాత పద్ధతిలోనే యూరి యా పంపిణీ చేయాలి
ఎంపీ ధర్మపురి అరవింద్

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 15:
దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశం సర్వ తోముఖాభివృద్ధి చెందు తోందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. వరు సగా 12 ఏళ్లు ప్రధాని పదవిలో ఉన్న మొదటి వ్యక్తి నరేంద్ర మోదీ అని అన్నారు. భారతదేశాన్ని ఎకనామికల్ సూపర్ పవ ర్ గా తీర్చిదిద్దడంలో ఆ యన ఎనలేని కృషి చేస్తు న్నారన్నారు. మోడీ నాయ కత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో గల బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడారు. మోదీ నాయకత్వంలో జాతీయ రహదారులు, మెట్రో రైల్స్, ఎయిర్ ఫోర్ట్ లు వివిధ ప్రతి రంగం లో అభివృద్ధి శరవేగంగా జరు గుతోందన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో దేశం లో 25 కోట్ల మందిని పేద రికం నుంచి విముక్తి కల్పిం చారని స్పష్టం చేశారు. 16 కోట్ల ఇళ్లకు జలీవన్ ద్వా రా స్వచ్ఛమైన తాగునీటి ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు.
పనికిమాలిన యూరియా యాప్ ..
పనికిమాలిన యూరియా యాప్ అనిఎంపీ అర్వింద్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి నగర్ లో గల బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లా డారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్ పేరుతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. ఆగ్రహం వ్యక్తం చేశారు. పాత విధానం ప్రకారం యూరి యాను పంపిణీ చేయా లని తెలిపారు.
సంక్షేమ పథకాల్లో రేవంత్ సర్కార్ విఫలం
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం సంక్షేమ పథకాల్లో పూర్తిగా విఫలమైందని ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కేవలం కమిషన్ వచ్చే పనులు మాత్రమే చేస్తుండని ఆరోపించారు. ఈ సమావే శంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్య నారాయ ణ, బీజేపీ జిల్లా అధ్యక్షు లు దినేష్ పటేల్ కుల చారి, బిజెపి రాష్ట్ర నాయ కులు స్రవంతి రెడ్డి, బిజెపి నాయకులు కార్పోరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
వివిధ రంగాల్లో మోదీ సాధించిన విజయాల పుస్తకాలను అందజేసిన ఎంపీ

దేశ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ వివిధ రంగాల్లో సాధించిన విజయాల పుస్తకాలను ఎంపీ ధర్మపురి అరవింద్ అందజేశారు. ఇందూరుకు చెందిన మేధావులను ఎంపీ ధర్మపురి అరవింద్ కలిసి పుస్తకాలను అంద జేశారు. అదేవిధంగా అంతర్జాతీ య ఫుట్బాల్ క్రీడాకారిణి కుమారి గుగు లోత్ సౌమ్య, చార్టెడ్ అకౌంటెంట్ గురుప్ర సాద్, న్యూరో సర్జన్ కట్ట నర్సిం హా, న్యాయ వాది సంఘ మేశ్వర్ రావు, ముదిరాజ్ సంఘం నాయ కులు, భజనకారులు అంబెం నడిపి సాయన్న, రంజీ క్రికెటర్ అనికేత్ రెడ్డి లకు ఎంపీ ధర్మపురి అరవింద్ పుస్తకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులచారి, బిజెపి రాష్ట్ర నాయకులు స్రవంతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు









Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *