ప్రధా నిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జీజీహెచ్ లో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్… ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని అర్బ న్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ప్రధా నిగా మోదీ 12 సంవత్స రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని జిల్లా
ప్రధా నిగా మోదీ 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
జీజీహెచ్ లో మొక్కలు నాటిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్…

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 5:
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు ప్రతి ఒక్కరు అమ్మ పేరుతో మొక్కలు నాటాలని అర్బ న్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు. ప్రధా నిగా మోదీ 12 సంవత్స రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరిం చుకొని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో శుక్రవారం అర్బన్ ఎమ్మెల్యే మొక్క లు నాటారు. ఈ సందర్భం గా ఎమ్మెల్యే సూర్య నారాయణ మాట్లాడారు. కేవలం మొక్కలు నాటడ మే కాకుండా వాటిని సం రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మొక్క లు నాటడం అంటే రాబో యే తరాలకు ఇచ్చే గొప్ప ఆస్తి అని చెప్పారు. మొ క్కలు నాటడం వల్ల ఆక్సి జన్ పుష్టిగా లభిస్తుంది అన్నారు.

పర్యావరణ పరిరక్షణకు కేంద్రం కృషి
పర్యావరణాన్ని కాపాడేం దుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చే పడుతుందని గుర్తు చేశా రు. మిషన్ లైఫ్ పేరుతో ప్లాస్టిక్ వాడకం తగ్గించ డం, నీటి సంరక్షణ పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. పాఠశాలలు కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటడం విరి విగా కొనసాగుతుం దన్నా రు. ప్రధాని మోదీ ఇటీవల ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని పిలు పునివ్వడం జరిగిం దని గుర్తు చేశారు. ఇప్పటికే అనేకమంది మోదీ పిలు పును పాటిస్తున్నా రని చెప్పారు. ఈకార్యక్రమం లో ఆసుపత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ నాగమో హన్, బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, కార్పొరేటర్ లు నాగోల్ల లక్ష్మీనారాయణ, బంటు ప్రీతి ప్రవీణ్, జ్యోతి మురళి, డాక్టర్ హరీష్ స్వామి, డాక్టర్ రాఘవేంద్ర చిద్రావార్, నాయకులు మాయావార్ కృష్ణ, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *