పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాలీ -మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ నిజామాబాదులో ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ ప్రారంభం ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 4: క్రమశిక్షణ, సరైన మార్గద ర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీ ఎస్ అధికారి జేడీ లక్ష్మీనా రాయణ తెలిపారు. దేశం లో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యా సంస్థలు నిజామాబాద్ నగరంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్ వేదికగా గురువారం
పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాలీ
-మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ
నిజామాబాదులో ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ ప్రారంభం

ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) జూన్ 4:
క్రమశిక్షణ, సరైన మార్గద ర్శకత్వం విజయానికి మూలమని మాజీ ఐపీ ఎస్ అధికారి జేడీ లక్ష్మీనా రాయణ తెలిపారు. దేశం లో ఐఐటీ-జేఈఈ, నీట్ శిక్షణలో అగ్రగామిగా ఉన్న రెసోనెన్స్ విద్యా సంస్థలు నిజామాబాద్ నగరంలోని హోటల్ వంశీ ఇంటర్నేషనల్ వేదికగా గురువారం ‘రెసోనెన్స్ ఫౌండేషన్ సెంటర్’ను ప్రారంభించింది.ఈ కార్యక్రమానికిమాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఈ కేంద్రా న్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐపీఎస్ అధి కారి జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాది నిర్మించుకోవాల్సిన అవస రం ఎంతైనా ఉందన్నారు. నిజామాబాదులో ఫౌండే షన్ కోచింగ్ ను అందుబా టులోకి తీసుకు వస్తున్న రెసోనెన్స్ విద్యా సంస్థ లను అభినందించారు. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగక రంగా ఉంటుందన్నారు.
అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు
రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా

అనుభవజ్ఞులైన అధ్యా పకులు, క్రమబద్ధమైన బోధనా పద్ధతులు, నిరం తర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్య ను అందించడానికి రెసో నెన్స్ కట్టుబడి ఉందనీ రెసోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా అన్నారు. ఈ ఫౌండే షన్ సెంటర్ విద్యార్థులకు ప్రాథమికాంశాలను బలో పేతం చేసుకోవ డానికి, ఐఐటీ-జేఈఈ, నీట్, ఒలింపియాడ్స్ వంటి పోటీ పరీక్షలకు ఆత్మవి శ్వాసంతో సిద్ధమవడానికి సహాయపడుతుందని తెలిపారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో ప్రారంభ దశ లోనే ప్రిపరేషన్ మొదలుపె ట్టడం, సంపూర్ణ అవగా హనతో కూడిన అభ్యా సం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతను వివరించారు.రెసోనెన్స్ అనేది ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి ఆర్కే వర్మ 2001లో రాజస్థాన్ లోని కోటాలో స్థాపించారు. ఇది దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ప్రతిష్టాత్మక విద్యాసంస్థ, గత రెండు దశాబ్దాలుగా రెసోనెన్స్ 87 నగరాల్లోని 150 పైగా కేంద్రాల ద్వారా 10 లక్షల (1 మిలియన్) పైగా వి ద్యార్థులకు శిక్షణ ఇచ్చిం ది. ఇందులో 3.3 లక్షల పైగా విద్యార్థులు ఐఐ టీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ప్రముఖ సాంకే తిక విశ్వవిద్యాల యాలు, టాప్ మెడికల్ కాలేజీలలో ప్రవేశాలు పొందారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఈ బల మైన వారసత్వంతో, పూర్ణ చంద్రరావు నర్రా దూరదృ ష్టితో కూడిన నాయకత్వం లో రెసోనెన్స్ 2018లో హైదరాబాద్ లో ఒకే ఒక్క క్యాంపస్ ప్రస్థానాన్ని ప్రారంభించింది. ఎంపీసీ, బైపీసీ గ్రూపులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ.. ఐఐటీ -జేఈఈ, నీట్, ఇతర పోటీ పరీక్షలకు సమగ్ర మైన శిక్షణ, అనుభవజ్ఞు లైన అధ్యాపకులు, క్రమ శిక్షణతో కూడిన ప్రిపరేష న్, ఫలితాల ఆధారిత విధానంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో నిరంతర విజయాలకు, విద్యా నైపుణ్యానికి రెసోనెన్స్ విద్యాసంస్థలు ఒక చిహ్నంగా మారాయి. కేవలం 7సంవత్స రాల లోనే, రెసోనెన్స్ విద్యాసం స్థలకు చెందిన 6,100 పైగా విద్యార్థులు ఐఐటీ లు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు, ఎయిమ్స్, ఇతర అగ్రశ్రేణి విశ్వవిద్యాలయా లలో సీట్లు సాధించారు. ఈ అద్భుతమైన విజయా ల స్ఫూర్తితో, రెసోనెన్స్ ఇప్పుడు ఫౌండేషన్ సెంట ర్లు, పాఠశాలలు, ఈ-లె ర్నింగ్, గ్లోబల్ స్టడీస్ రంగా లలోకి విస్తరించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా 50 పైగా క్యాంపస్లతో విజయ వంతంగా దూసుకుపో తోంది.










Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *