టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 20: జనగణన ప్రక్రియలో కుల గణన కూడా చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు బుధవారంఒక ప్రకటనలో వెల్లడించారు. దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కుల గణ న అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుం చో డిమాండ్ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్
టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్
ఉమ్మడి జిల్లా బ్యూరో (కబురు న్యూస్) మే 20:

జనగణన ప్రక్రియలో కుల గణన కూడా చేపట్టాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పై టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు బుధవారంఒక ప్రకటనలో వెల్లడించారు. దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలను సరిచేయడానికి కుల గణ న అత్యంత అవసరమని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుం చో డిమాండ్ చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ భార త్ జోడో యాత్ర సందర్భం గా దేశవ్యాప్తంగా కుల గ ణన అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని, సామాజిక న్యాయం సాధనకు కుల గణన కీలకమని స్పష్టం చేశారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలకు వారి జనాభా ప్రాతిపదికన న్యాయం జరగాలంటే సమగ్ర కుల గణన తప్ప నిసరి అని కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతోం దన్నారు.తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో, మంత్రు లు, ప్రజాప్రతినిధుల సమ న్వయంతో చేపట్టిన కుల సర్వే విజయవం తమైం దని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం అత్యంత పారదర్శ కంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించిన ఈ సర్వే దేశానికే ఆదర్శంగా నిలి చింద న్నారు.సామాజిక న్యాయం, సమాన అవకా శాలు, సంక్షేమ ఫలాల సరైన పంపిణీ కోసం కుల గణన ఎంతో ఉపయోగప డుతుందని పేర్కొన్నారు.తెలంగాణలో చేపట్టిన కు ల సర్వే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన నిర్వ హించాలని టీపీసీసీ అధ్యక్షులు డిమాండ్ చేశారు.


















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *