భారీ డిస్కౌంట్ లు ఇస్తూ నాసిరకమైన మందులను అంట గడుతుండ్రు వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం జిల్లాలో ఒకరోజు మెడికల్ దుకాణాల బంద్ ఉమ్మడి జిల్లా బ్యూరో ( కబురు న్యూస్) మే 20: కార్పొరేట్ సంస్థల ఆన్లైన్ విక్రయాలు వెంటనే ఆపా లని జిల్లా కెమిస్ట్రీడ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షులు మధుసూదన్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త ఒకరోజు మెడికల్ దుకాణాల సమ్మెలో సభ లో భాగంగా నిజామాబా ద్
భారీ డిస్కౌంట్ లు ఇస్తూ నాసిరకమైన మందులను అంట గడుతుండ్రు
వెంటనే మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం
జిల్లాలో ఒకరోజు మెడికల్ దుకాణాల బంద్

ఉమ్మడి జిల్లా బ్యూరో ( కబురు న్యూస్) మే 20:
కార్పొరేట్ సంస్థల ఆన్లైన్ విక్రయాలు వెంటనే ఆపా లని జిల్లా కెమిస్ట్రీడ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్య క్షులు మధుసూదన్ డిమాండ్ చేశారు. దేశ వ్యాప్త ఒకరోజు మెడికల్ దుకాణాల సమ్మెలో సభ లో భాగంగా నిజామాబా ద్ జిల్లా కేంద్రంలో జిల్లా కెమిస్ట్రీడ్రగ్గిస్ట్ అసోసియే షన్ ఆధ్వర్యంలో జిల్లాలో స్వ చ్ఛందంగా మెడికల్ షాపు లు బందు చేశారు. సుమా రు జిల్లా వ్యాప్తంగా 1400 మెడికల్ దుకా ణాలు ఉన్నాయి. ఈ సందర్భంగా జిల్లా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి బిర్కూ రు సుధాకర్, కోశాధికారి మొర సాయిలు మాట్లా డారు. ఆన్లైన్లో అమ్మకాల పై భారీ డిస్కౌంట్లను ఇస్తూ నాసిర కం మందు లను అంటగడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగా టమాడుతున్నారని ఆరో పించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి పలు మార్లు విన్నవించిన ప్ప టికీ స్పందించ కపోవ డంతో దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ దుకా ణాల బందు కార్యక్రమం చేపట్టడం జరిగింది అన్నారు. ఆన్లైన్లో అమ్మ కాలు ఆపాలని ,భారీ డిస్కౌంట్లు ఇవ్వొద్దని, నాసిరకమైన మందులు అమ్మకం ఆపాలని డి మాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిం చారు. మందుల కోసం జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురవుతే మా అసోసి యేషన్ ఆధ్వర్యంలో నిర్ధారణ చేసి వారికి మం దులు అందజే స్తున్నా మని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లోని మెడికల్ దుకాణాల యజమానులు, అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



















Leave a Comment
Your email address will not be published. Required fields are marked with *